ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15, 000 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ. 15, 400గా పలికింది. క్వింటా పత్తి ధర రూ. 7, 050 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత గురువారంతో పోలిస్తే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, కొత్త మిర్చి ధర రూ. 300, పత్తి ధర రూ. 100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
![]() |
![]() |