ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ ప్రజల సమక్షంలో ప్రజా పాలన సభ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 04:10 PM

ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామం గ్రామ వేదికలో జరిగినటువంటి సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ వంశీకృష్ణ సాగర్ సమక్షంలో గ్రామసభ జరిగినది సభను ఉద్దేశించి గ్రామపంచాయతీ సెక్రెటరీ పి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీల  ఆరు గ్యారెంటీలలో భాగం లో ఇప్పటికే ఫ్రీ బస్సు , 500 రూపాయల సబ్సిడీ గ్యాస్,200 యూనిట్ కరెంటు, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది నాడురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలకు ప్రారంభించడం జరిగింది ఇందులో రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మరియు రేషన్ కార్డులు పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని గతంలో  గ్రామసభలో నమోదు చేసుకోలేనివారు ఎవరైనా ఉంటే మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గ్రామసభ లో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
గ్రామ సభలో  ఎవరికైనా రాలేదని వారు ఉంటే .మండల కార్యాలయంలో ప్రతి ఒక్కరికి ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది.  ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంసంక్షేమ పథకాలలో నిరుపేదలు భూమిలేని వారికి  ఎంపిక చేసి ఇందిరమ్మ భరోసా, ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఎకరానికి రెండు పంటలు చొప్పున 12 వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో నిజంగా అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. 
అలాగే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా  జారీ చేయడం జరిగింది.  అర్హులైన వారికి ఎంపిక చేసి రేషన్ కార్డు లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా. రేషన్ కార్డులో పేర్లను ఎక్కించు కొనడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది.   కొత్తగా వివాహం చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డును అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి రేషన్ కార్డు రానివారు మరొకసారి ఈ ప్రజా పాలనలో గ్రామసభ నందు నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరగా రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. 
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను జనవరి 26 తేదీ నాడు  ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతులకు, రైతు భరోసా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం గ్రామ సభలను ఏర్పాటు చేసి  ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలి అదేవిధంగా కొన్ని గ్రామాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని వెంటనే అధికారులు పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలలో అవకాశం కలిపించి ఇందిరమ్మ ఇల్లు లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కృషి చేయాలి అని కోరారు. 
గ్రామంలో గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎవరని కూడా ఎంపిక చేయలేదు ఒక ముసాయిదా పేరులను చేసుకోవడం జరిగింది. గ్రామ సభలో తీర్మానీoచిన వారిని నిజమైన అర్హులైన వారికి ఎంపిక చేసి ఇంచార్జి మంత్రికి నివేదిక పంపించిన తర్వాతనే ఈ పథకాలను నిజమైన అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి వర్తించే విధంగా ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. 
 ఈ గ్రామసభల్లో నమోదు చేసుకోలేని వారు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సభ్యులను తీసుకొని నమోదు చేసుకోగలరు వారికి కూడా త్వరలో ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వం సహాయశక్తుల కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 
కొత్త రేషన్ కార్డును  జారీ చేయడం జరిగింది‌. 2011 లెక్కల ప్రకారం దాదాపుగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు నమోదు కావడం జరిగింది ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాలేదని నమోదు చేసుకోలేదని పరిస్థితి ఉంటే వారి గ్రామసభలో కూడా నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరలో రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని బట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా నిజమైన నిరుపేదలకు నివాసం లేని ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు లేని వారికి, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , మొదటి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది.
ఇందిరమ్మ ఆత్మీయ పథకంలో గ్రామంలో నిరుపేద ఇలాంటి భూమిలేని వారికి 20 రోజులు పాటు ఉపాధి హామీ ఉన్నవారికి ఎంపిక చేయడం జరిగింది. వీటిలో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ప్రభుత్వం నుండి వస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు స్పెషల్ ఆఫీసర్ వంశీకృష్ణ సాగర్ టీం లీడర్ సూపర్డెంట్ జయరాములు గ్రామ పంచాయతీ సెక్రెటరీ పి రామకృష్ణ ఏ ఈ ఓ కవిత రాణి రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి రఘు అదేవిధంగాభారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa