దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. వాణిజ్య యుద్ధ భయాలు రేపిన ట్రంప్ నుంచే ఓ సానుకూల నిర్ణయం వెలువడటంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీలూ భారీ లాభాల్లో కొనసాగడానికి ప్రధాన కారణమైంది.సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 23,600 పాయింట్ల మార్కును దాటింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 1155 పాయింట్లు లాభంతో 78,342 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 23,685 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. జొమాటో, ఐటీసీ హోటల్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa