ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ కులగణన అసెంబ్లీలో తీర్మానం చేయాలి నీ తాసిల్దార్ కు వినతి పత్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 01:51 PM

దేశంలో బీసీల కుల గణన  కోసం అసేంబ్లీలో తీర్మానం చేయాలనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల గణన ప్రకారం 56 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనీ కోరుతూ నల్లబెల్లి తహిసిల్దార్ కు మెమోరాండం ఇచ్చిన బీసీ హక్కుల సాధన సమితి. దేశంలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి కుల జనగణన చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వులను ఇప్పించాలనీ,కుల జనగణన ప్రకారమే విద్యా, ఉద్యోగాలలో, చట్టసభల్లోనూ ఎవరి వాటా వారికి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనీ బీసీ హక్కుల సాధన సమితి  జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి నేతృత్వంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా దేశ ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి  పంపాలని కోరుతూ జిల్లా డీఆర్ ఓ కి  పది డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఎలాంటి కుల జన గణన చేయకుండానే 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2021లో జరపవలసిన కలజన లెక్కల సర్వే కరోనా వలన వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ 2025 లో కులజనగణన చేసి, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి,ఎవరి దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభలలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రయివేటు రంగాల్లో ఎవరి వాటా వారికి ఇవ్వాలని, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద బీసీలకు పదిలక్షల రూపాయలతో పక్కా ఇండ్ల పథకం అమలు చేయాలనీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలకు నర్సరీ నుంచి పీజీ వరకు, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలలో యూనివర్సిటీలలో పూర్తిగా ఫీజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధంగా చట్టసవరణ చేయాలనీ, ఆర్థికాభివృద్ధికోసంం బీసీలకు చేతి వృత్తులు, చిరు, మధ్యతరగతి వ్యాపారులకు,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, మల్టిపుల్ పరిశ్రమలకు ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు 50% సబ్సిడీతో ఋణాలివ్వాలి, అన్ని రోగాలకు, శస్త్ర చికిత్సలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనీ, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కుల గణన ప్రకారం 56% రిజర్వేషన్లు అమలు చేయాలని,నగరపంచాయితీ మున్సిపల్,, కార్పోరేషన్, జిల్లా పరిషత్ చైర్మన్ లలో 56%పదవులివ్వాలనీ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కో కన్వీనర్ లు  మేడిపల్లి రాజు పాండవుల రాంబాబు బత్తిని మల్లయ్య,నానెబోయిన నరేష్ ,కోల లింగయ్య,బూస కుమారస్వామి,హరీష్ , తదితరులు పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa