ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమీన్‌పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 05:05 PM

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శుక్రవారం పర్యటించారు. స్థానికంగా ఉన్న ఓ ప్లాట్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగనాథ్‌ అక్కడికి వెళ్లారు. తమ ప్లాట్లు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐలాపూర్‌లో పర్యటించిన హైడ్రా కమిషనర్‌.. బాధితుల సమస్యలు విన్నారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.అనంతరం రంగనాథ్‌ స్పందిస్తూ.. ‘‘భయభ్రాంతులకు గురి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరువర్గాలు చెప్పింది వింటాం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను పరిశీలించి 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తాం’’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa