స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నేడు సమావేశం కానున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలకు ఓటర్ల జాబితాలు, పోలింగు కేంద్రాలు సిద్ధం కాగా.. MPTC, ZPTC సభ్యుల ఎన్నికల కోసం ఓటర్ల, పోలింగు కేంద్రాల జాబితాలు ఈ నెల 15న విడుదలవుతాయి. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల సమాచారం రాగానే EC షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లను ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు సమావేశం నిర్వహిస్తోంది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50శాతం సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పేర్కొన్నట్లు సమాచారం. రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
![]() |
![]() |