పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన ఎంబీఏ ఫ్యాకల్టీ డా. రాజిడి రామ్మోహన్ రెడ్డి అభినందన సభ, ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి డాక్టర్ రామ్మోహన్ రెడ్డిని అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..రామ్మోహన్ రెడ్డి అంకితభావంతో, అకడమిక్ పరిశోధనలో చేసిన విశేష కృషికి జేజేటి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా అందుకోవడం విశేషమైన గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాము అని. వారు చేసిన పరిశోధన అంశం "భారతీయ కంపెనీలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీస్ ప్రభావం బ్రాండ్ ఇమేజ్ మరియు వినియోగదారుల అభిప్రాయంపై" అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంపై ఆయన చేసిన పరిశోధన, నేటి వ్యాపార ప్రపంచానికి ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా ఉంది.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలు (సి ఎస్ ఆర్) ఎలా బ్రాండ్ ఇమేజ్ను మెరుగుపరిచేలా,వినియోగదారుల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా పనిచేస్తాయనే అంశంపై ఆయన చేసిన లోతైన అధ్యయనం, భవిష్యత్తు వ్యాపార వ్యూహాలకు ఉపయోగపడేలా ఉంటుంది తెలియజేశారు.ఈ పరిశోధన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రముఖ జర్నల్స్ లోప్రచురించబడినందుకు, అలాగే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన కాన్ఫరెన్స్లలో ప్రజెంటేషన్ రూపంలో వివరించి విశేషమైన గుర్తింపు పొందినందుకు గర్వించదగిన విషయం అని అన్నారు.ఈ సందర్భంగా డా.రాజిడి రామ్మోహన్ రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తు పరిశోధనలు మరింత శోభాయమానంగా ఉండాలని, విద్యారంగానికి,పరిశోధనా రంగానికి ఆయన మరిన్ని విశేష సాధనాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్,ఎంబీఏ విభాగ అధిపతి డాక్టర్ ఆరిఫ్,ఏవో సురేష్ ఇతర విభాగాధిపతులు ప్రభాకర్, స్వాతి,డాక్టర్ నటరాజన్ , చొప్పరి వంశీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa