బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులో అక్రమంగా 40 టన్నుల ఇసుకను డంపు చేశారని సమాచారంతో సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, బెజ్జంకి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, బెజ్జంకి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాగిల్లాపూర్ గ్రామ శివారులో ఏపీ 23 am 33 14 నెంబర్ గల జెసిబి తో లింగారెడ్డి పల్లె గ్రామం సిద్దిపేట మండలం కు చెందిన జెసిపి డ్రైవర్ రాజేష్, బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన జెసిపి యజమాని గూడెం శ్రీను లు ఇద్దరు కలిసి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపు చేస్తున్నార ని పక్క సమాచారంతో సిద్దిపేట జిల్లా టాస్క్ ఫోర్సు పోలీసులు, బెజ్జంకి పోలీసులు పట్టుకున్నారు.
ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైసు,మొరము మట్టి,అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేకరించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సిద్ధిపేట టాస్క్ ఫోర్సు అధికారులకు 8712667445, 871266 7446, 8712667447 అనే ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ మేరకు అక్రమంగా 40 టన్నుల ఇసుక ను డంపుచేసిన ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెజ్జంకి పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa