ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 02:21 PM

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని  కమిషనర్ మోహన్ హెచ్చరించారు. మెట్ పల్లి పట్టణంలోని పలు వీధులలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
రోడ్ల వెంట చెత్తను తొలగించడం తోపాటు మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. ప్లాస్టిక్ కవర్లను, చెత్తను మురికి కాలువలో వేయవద్దని కమిషనర్ ప్రజలకు సూచించారు. చెత్తను నిర్లక్ష్యంగా రోడ్లపై పారవేసే వ్యక్తులకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఇంఛార్జి సానిటరీ ఇన్స్ పెక్టర్ ముజీబ్, నరేష్, నిజాం లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa