ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణలో చారిత్రక గోడల తొలగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 12:50 PM

సికింద్రాబాద్‌ అంటే గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్‌ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో నాటి కళాసంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇది 1916 వరకు నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్)కు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ, స్వాతంత్య్రం అనంతరం 1951లో ఎన్జీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ భాగమైంది. దీంతో 1952లో ఈ రైల్వే స్టేషన్‌ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. నిజాం ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా కోటను పోలి ఉండేలా పోర్టుకు డిజైన్ చేశారు. అభివృద్ధిలో భాగంగా దీనిని కూల్చివేసి.. ఆధునిక హంగులతో కొత్త భవనం నిర్మించనున్నారు. శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా దశలవారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు రూ.700 కోట్ల అంచనాతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు సరిపడేలా మౌలిక వసతులతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa