ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం మినీ జాతరకు పోటెత్తిన భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 12:55 PM

ములుగు జిల్లా మేడారం మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. మూడో రోజు లక్షలాదిగా తరలివచ్చి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మినీ జాతర తొలి రోజైన బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు. రేపటితో జాతర ముగియనుంది.సమ్మక్క–సారలమ్మ  పూజారులు అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం నుంచే మొదలైన భక్తుల తాకిడి మధ్యాహ్నం వరకు కొనసాగింది.జంపన్నవాగు వద్ద షవర్ల కింద స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa