సమాచార హక్కు చట్టం 2005 బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ అన్నారు. సొసైటీ మండల కమిటీలో నూతనంగా నియామకమైన కాగజ్ నగర్ మండల ఉపాధ్యాక్షులు పొలాజి సంతోష్ కుమార్, మండల జాయింట్ సెక్రటరీ దుర్గం సంతోష్ లకు నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు నాగేష్ ఆధ్వర్యంలో నియామక పత్రలను అందచేశారు. అనంతరం ప్రవీణ్, నాగేష్ లు మాట్లాడుతూ సామాన్య మానవుడు ప్రశ్నించేందుకు చట్టబద్ధంగా రూపొందించిన చట్టమే సమాచార హక్కు చట్టం అన్నారు.
దేశంలోని సామాన్య ప్రజలకు ఒక వరంగా వారి చేతిలో ఉన్న ఏకైక చట్టం సమాచార హక్కు చట్టం అని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల, పథకాల నిధుల వివరాలు, ఖర్చుల వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. సహ చట్టం కార్యకర్తలు చట్టం అమలు కొరకు రాజ్యాంగ బద్ధంగా, సొసైటీ నియమ నిబంధనలు పాటించాలన్నారు. గ్రామస్థాయి వరకు సహ చట్టం అమలుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిల కృషి చేయాలన్నారు.
సహ చట్టం అమలు కొరకు, బలోపేతం కొరకు సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ప్రభుత్వ అధికారులతో కలిసి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నూతన కమిటీ సభ్యులు జిల్లా మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa