ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరూ చూస్తుండగా యువకుడిని కత్తులతో పొడిచి చంపిన వైనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:27 PM

హైదరాబాద్ శివారు మేడ్చల్ లో ఇవాళ పట్టపగలే దారుణం జరిగింది. దుండగులు నడిరోడ్డుపై ఓ యువకుడిని హత్య చేశారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి అంతమొందించారు. హత్య అనంతరం ఇద్దరు దుండగులు అక్కడ్నించి పరారయ్యారు.హత్యకు గురైన యువకుడిని ఉమేశ్ (25) గా గుర్తించారు. కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మద్యానికి బానిసైన సొంత తమ్ముడే హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఉమేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా, ఘటన స్థలిలో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హత్య వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa