డిండి మండలంలోని కామేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన 2004 _ 2005 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు గత 20 సంవత్సరాలలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఉపాధ్యాయుల సేవలను, కొనియాడుతూ, గురువులను శాలువాలతో, పూలదండలతో సన్మానించారు
ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయులు ,పూర్వ విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు పల్లా వెంకటరెడ్డి, జంగారెడ్డి, అడపాల శేఖర్ రెడ్డి ,నారయ్య, శ్రీనివాస్ ,వెంకటనారాయణ, గౌస్ ,తిరుపతయ్య ,సౌజన్య, రాధా ,శిరీష, నాగరత్నం మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa