ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానంమే పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 01:29 PM

లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరిరోడ్డు కొత్త ప్లాట్స్ లో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య లకావత్ రాజకుమారి అనే 40సంవత్సరాల మహిళను తన భర్త గణేష్ సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడని ఆదివారం ఎస్సై సతీష్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రోజు మద్యం తాగి భార్యకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందని కొడుతూ, తిడుతూ, చంపుతానని బెదిరించేవాడు. 
అదే క్రమంలో నిన్న రాత్రి భార్యతో గొడవప పడ్డాడు. తన భార్య ఈరోజు ఉదయం 3.30గంటలకు బాత్రూమ్ కు వెళ్లగా వెనకాలే వెళ్లి బాత్రూంలో సిమెంట్ ఇటుక బండరాయితో తలపై కొట్టి చంపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి బుఖ్య రేణుకాబాయి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa