జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్ర నివాసి అయిన సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి అనవసరంగా జర్నలిస్ట్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఏఐఎంఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రముఖ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి హెచ్చరించారు.ఆదివారం అయన ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు.
మా ఎమ్మెల్యే పై వార్త ఎవరు రాశారు అంటూ అవినీతి అక్రమాలకు పాల్పడి కొందరు చోటా నాయకులు జర్నలిస్టులకు ఫోన్ కాల్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన జర్నలిస్టులకు ఏది జరిగినా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటదని అధికార పార్టీ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటదని ఆయన తెలియజేశారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వాలు దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లడానికి వారధిగా పనిచేయడమే మా జర్నలిస్టుల కర్తవ్యం అని ఆయన అన్నారు,నిజాలను నిర్భయంగా వార్తలు రాస్తే ఫోన్ కాల్ చేసి జర్నలిస్టులను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించిన అవినీతి అహంకారంతో కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డ వారి పై చట్టబద్ధంగా తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరించారు. మీ అరాచకాలు మీ దోపిడీ ఇప్పటికైనా ఆపకుండా ఇలాగే కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు ముక్తకంఠంతో న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల ఓపికను ఐక్యతను పరీక్షిస్తే మీకే ప్రమాదం అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వేధింపులు వచ్చిన నేరుగా తనను సెల్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చునని చుక్క గంగారెడ్డి నిర్భయంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa