మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం దేవరకొండ పట్టణంలో తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 17న, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూప కర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమ పోస్టర్లను బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే నాయకుడు కెసిఆర్ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా వృక్షార్జన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి వాతావరణంలో సమతుల్యతను కాపాడడంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.పర్యావరణ పరిరక్షణ కొరకై శ్రమిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,బోడ్డుపల్లి కృష్ణ,యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పొట్ట మధు,మకాం చంద్రమౌళి,బి ఎన్ ఆర్ బాబా,ఆఫ్రోజ్,జమిర్ బాబా,గండురి లక్ష్మణ్,శాదబ్,శ్రీను,తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa