ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రంజాన్ మాసం సందర్బంగా.. ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వారి మతపరమైన ఆచారాలను పాటించేందుకు వీలుగా.. రోజువారీ విధుల సమయాన్ని ఒక గంట తగ్గించి.. ముందుగా ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ప్రభుత్వం కల్పిస్తోన్న ఈ తాజా వెసులుబాటు.. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అందరు ముస్లిం సిబ్బందికి వర్తించనుంది.
అయితే.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయి.. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం దొరకుతుంది. అయితే.. ముస్లిం ఉద్యోగుల మతపరమైన ఆచారాలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది.. ఈ విధంగా పని సమయాల్లో సడలింపు ఇస్తుండగా.. ఆ సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొనసాగిస్తోంది.
మరోవైపు.. ముస్లింల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంజాన్ వేడుకల నిర్వహణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని.. గత ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పేరుతో కానుకలు కూడా అందించేది. అయితే.. ఇప్పుడు కూడా.. ముస్లిం కుటుంబాలకు వారి అవసరాలకు అనుగుణంగా.. ప్రత్యేక రేషన్ సరఫరా, మసీదుల వద్ద వసతులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రంజాన్ మాసంలో మతపరమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించినట్టు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ విధుల నుంచి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ.. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. గత ప్రభుత్వం అందించినట్టుగా రంజాన్ తోఫాలాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రత్యేక కానుకలు ఏమైనా అందిస్తుందా లేదా.. అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa