ఈ ఏడాది వేసవి సాధారణాన్ని మించి తీవ్రంగా ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండగా, వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్, మే నాటికి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు చేరొచ్చని అంచనా వేసింది.1901 నుంచి 2025 వరకు గల గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరగొచ్చని వెల్లడించారు. గత 125 ఏళ్లలో గాలిలో తేమ శాతం తగ్గిపోయినట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa