మాలలు జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను అనుభవించారని ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల సమాన కంపెనీ కోసం తాము వర్గీకరణ ఉద్యమం చేపడితే మాలలు అడ్డుకున్నారని విమర్శించారు. జస్టిస్ షమీ అక్తర్ నివేదిక శాస్త్రీయంగా లేదని గ్రూపుల్లో కులాల చేర్పు సరిగ్గా లేదని, దీనిని సవరించాలన్నారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఎస్సీ కులాల సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎస్సీలలోని నేతకాని, మహార్, ఓలియ దాసరి, మాల దాసరి, మిత్ అయ్యల్వార్, డోర్, మంగ్, మాంగ్ గరోడి తదితర కులాలను ప్రత్యేక గ్రూపులో కాకుండా గ్రూపు-3లో చేర్చారని, మాలల ఒత్తిడి వల్లనే ఇది జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మాజీ ఎంపీ వెంకటేష్ మెహతా మాట్లాడుతూ నేతకాని కులస్థులను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని, మాలలతో కలిసి ఉండమని అన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నేతలు బి.దీపక్కుమార్, పృథ్వీరాజ్యాదవ్, దుర్గం రాజేష్, రాంబాబు, బాలాజీ, చంద్రశేఖర్, సోమయ్య, కిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa