సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనసందోహం మధ్య ఓ కానిస్టేబుల్ విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నాడు. అంతలోనే ఓ యువతి నవ్వుకుంటూ.. అక్కడకు వచ్చింది. తన మొబైల్ ఫోన్ పోయిందని.. తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకోవాలని చెప్పి.. కానిస్టేబుల్ ను ఫోన్ అడిగింది. అతడు సానుభూతితో తన ఫోన్ ఇచ్చాడు. ఆమె నంబర్ డయల్ చేసి.. తాను ఇంటికి రావడం లేటవుతుందని చెప్పింది. మరికొన్ని క్షణాలు మాట్లాడి.. ఆమె పోలీస్ కు ఫోన్ ఇచ్చి.. కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది.
ఆ రాత్రి కానిస్టేబుల్ కు తెలియని నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. "హాయ్, నేను మీనా.. ఈరోజు మీ సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. అలా మాటలు కలిపింది. మళ్లీ మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి.. తాను హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపింది. వారు కలుసుకున్నప్పుడు.. సరదాగా మాట్లాడుకున్నారు. తర్వాత తనకు అత్యవసరంగా రూ.40,000 కావాలంటూ అడిగింది. కానీ అతడు సాయం చేయలేను అని చెప్పేశాడు. దానికి ఆమె కోపంతో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఘటనను ఊహించని అతడు రూ.40 వేలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు.
ఇక మరో ఘటనలో.. అదే ప్రాంతంలో హోంగార్డ్ ను కూడా ఆమె అదే పద్దతిలో పట్టుకుంది. ఫోన్ లో అతడితో మాటలు కలిపింది. వినకపోవడంతో.. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నాడంటూ అందులో పేర్కొంది. పోలీసులు ఆమె గురించి తెలుసుకుని.. తగిన చర్యలు తీసుకున్నారు. వెంటనే బయటకు వచ్చిన ఆ మహిళ ఉన్నతాధికులకు ఫిర్యాదు చేస్తామంటూ అక్కడ నుంచి మాయమైంది. ఇక ఆమె గురించి పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వరంగల్కు చెందిన ఈ 25 ఏళ్ల కిలేడీ డిగ్రీ చదివింది. సొంత అవసరాల కోసం మోసం చేయడం నేర్చుకుంది. ఆమె బాధితులను లాడ్జీకి తీసుకువెళ్లి.. వారిని లైంగిక వేధింపులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి.. లక్షలాది రూపాయలు వసూలు చేసింది. ఈ మోసం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆమె మరిన్ని నేరాలను కప్పిపుచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. వరంగల్ లో కూడా అనేక మంది ఈమె బారిన పడ్డారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa