ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్ బిర్యానీ సగం తిన్న తర్వాత షాకింగ్ సీన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 05:51 PM

బిర్యానీ అంటే ఒక ఎమోషన్. ఏ చిన్న సంతోషం వచ్చినా బిర్యానీతోనే సెలెబ్రేట్ చేసుకుంటుంటారు. అందులోనూ చికెన్ బిర్యానీకి ఫ్యాన్ బేస్ కాస్త ఎక్కువే. బ్యాచిలర్‌లు అయితే.. బిర్యానీ తినేందుకు పెద్దగా కారణాలు కూడా వెతుక్కోరు. జస్ట్ తినాలన్న ఆలోచన వస్తే చాలు.. ఆర్టర్ పెట్టుకోవటమో, రెస్టారెంట్‌కు వెళ్లిపోవటమో.. కడుపు నిండా బిర్యానీ లాగించేయటమే. కొందరైతే.. రోజూ బిర్యానీ పెట్టినా హ్యాపీగా లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అంత ఇష్టంగా తినే బిర్యానీని తినేందుకు చాలా మంది ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కారణం.. ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్న జుగుప్సాకరమైన సంఘటనలే.


తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బిర్యానీ తినేందుకు పట్టణంలోని ఓ మంచి రెస్టారెంట్‌కు వెళ్లాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. ఏమాత్రం వెయిట్ చేపించకుండానే.. గుమగుమలాడే బిర్యానీతో వెయిటర్ రానే వచ్చేశాడు. ప్లేట్‌లో బిర్యానీ వడ్డించాడు. ఆ వాసనకే నోట్లో లాలాజలం అలా ఊరిపోతుండటంతో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. లాగించటం మొదలుపెట్టాడు ఆ యువకుడు. ఓ నాలుగు ముద్దలు తిన్నాడో లేదో.. అప్పటివరకు నోట్లో లాలాజలం ఊరించిన ఆ బిర్యానీ.. ప్లేట్లో కనిపించింది చూసి ఒక్కసారిగా కడుపులో దేవేసినంత పనైంది. ఇంతకూ ఏం కనిపించిందనేగా మీ డౌటనుమానం. ఇంకేముంటుందండి.. మాంచిగా ఉడికిన బొద్దింక.


వెంటనే.. రెస్టారెంట్ సిబ్బందిని పిలిచిన కస్టమర్.. ఆ బిర్యానీలో కనిపించిన బొద్దింకను చూపిస్తూ.. ఇదేంటంటూ నిలదీశాడు. బిర్యానీలో బొద్దింకను చూసినప్పటికీ.. సిబ్బంది మాత్రం ఏం తెలియనట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ ఘటన అనంతరం.. బాధిత కస్టమర్ వెంటనే కిచెన్‌లోకి వెళ్లి చూడగా.. పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణం కనిపించింది. ఈగలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతుండటం చూసి.. అందరూ లొట్టలేసుకుంటూ తింటోంది ఇలాంటి ప్రదేశంలో వండిన తిండేనా అని ముక్కున వేలేసుకున్నాడు కస్టమర్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇటీవల ఫుడ్ సెఫ్టీ అధికారులు.. రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం తమ తీరు మాత్రం మార్చుకోవట్లేదు. ఆహార నాణ్యతను గాలికి వదిలేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంటకాల్లో ప్రాణాంతకమైన రసాయనాలు, కుళ్లిపోయిన పదార్థాలు ఉపయోగించటమే కాదు.. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో వండటం, వండిన పదార్థాలను శుభ్రమైన ప్రదేశాల్లో ఉంచకపోవటంతో.. తరచూ ఇలా పురుగులు, బొద్దింకలు అంటూ రకరకాల అవశేషాలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa