ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్వేశిపురం ఆలయం వద్ద షాపుల నిర్వహణకు టెండర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 12:22 PM

కనగల్ మండలం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ దుకాణాల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలనీలాల సేకరణ, వాహనాలకు బొట్లు, కొబ్బరి చిప్పల సేకరణ, చీరలు, ఒడిబియ్యం సేకరణకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ఆవరణలో జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. వివరాలకు ఆలయంలో సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa