ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:11 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని రాజోలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి, తరగతి గదిలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. టీచర్స్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నిఖిత, ఉపాధ్యాయలు బృందం భానుప్రియ, అలేఖ్య, సింధుజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa