ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:22 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు నల్గొండ న్యాయస్థానం నిన్న (మార్చి 10న) శిక్షలు కరారు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత ప్రణయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రణయ్ తండ్రి, కుటుంబ సభ్యులతో పాటు ఆ కేసును డీల్ చేసిన అప్పటి ఎస్పీ ఐపీఎస్ ఏపీ రంగనాథ్ కూడా స్పందించారు. కాగా.. అమృత మాత్రం ఎక్కడా మీడియాముఖంగా స్పందించలేదు. కాగా.. ఈరోజు (మార్చి 11న) తన ఇన్‌స్టాగ్రాం వేదికగా స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది.


"నా శ్రేయోభిలాషులందరికీ.. నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగింది. నా మనసు భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ తీర్పు పరువు పేరుతో జరిగే నేరాలు, దురాగతాల సంఖ్యను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో ఇచ్చిన అంచంచలమైన మద్దతు ఇచ్చిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.


నా కొడుకు పెరుగుతున్నాడు. కాబట్టి నా మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అతని భవిష్యత్తును కాపాడుకునేందుకే మీడియాలో కనిపించట్లేదు. ఎటువంటి ప్రెస్ మీట్‌లను నిర్వహించట్లేదు. మా ప్రైవసీని శ్రేయోభిలాషులందరూ అర్థంచేసుకుంటారని అభ్యర్థిస్తున్నాను.


మాపై అంతులేని ప్రేమ, మద్దతుగా నిలుస్తున్న నా అనుచరులు, సబ్‌స్కైబర్లు, శ్రేయోభిలాషులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా." అంటూ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. కాగా.. 2018లో తెలంగాణ మొత్త ఉలిక్కిపడేలా చేసిన ప్రణయ్ హత్య కేసు.. దేశమంతా చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. అమృత ప్రణయ్‌లు ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు పేరుతో అమృత తండ్రి మారుతీరావు చేపించిన హత్యగా సమాజం భావించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఆరేళ్ల పాటు సాగింది. కాగా.. ఈ కేసుపై విచారణ జరిపిన నల్గొండ న్యాయస్థానం.. మార్చి 10న తీర్పు వెలువరించింది. ఈ కేసులో మారుతీరావును ఏ1గా పేర్కొనగా.. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవటంతో.. మిగిలిన నిందితులను కోర్టు శిక్షలు విధించింది. అందులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించిన కోర్టు.. మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేపించినట్టుగా న్యాయస్థానం నిర్ధారించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa