ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు గ్యారంటీల అమలు దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 05:43 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. మొత్తం బడ్జెట్ – ₹3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం – ₹2,26,982 కోట్లు, మూలధన వ్యయం – ₹36,504 కోట్లుగా పేర్కొన్నారు.ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ముందుగా కేబినెట్‌కు సమర్పించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో భారీగా రూ.56,084 కోట్లు కేటాయించింది. ఈ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకాలు ప్రత్యేకంగా పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని తెలిపారు.రైతు భరోసా – ₹18,000 కోట్లు, చేయూత పింఛన్లు – ₹14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు – ₹12,571 కోట్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) – ₹2,080 కోట్లు, గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ – ₹723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – ₹600 కోట్లు, విద్యుత్ రాయితీ – ₹11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం – ₹6,000 కోట్లు, మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు సహా) – ₹4,305 కోట్లు కేటాయించారు. ఈ పథకాల అమలుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa