ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చారు: భట్టి విక్రమార్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 09:34 PM

గత ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో భట్టి ప్రసంగించారు. శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారని భట్టి పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ స్వయంగా వెల్లడించిందని ఆయన వ్యాఖ్యానించారు. రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ఏమి నిర్మించింది? ఆయన నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa