కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతోంది. ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటూ పాలన సాగిస్తోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తోంది. ఇటీవల నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా సాగుతోంది. అర్హులైన వారికి రూ.3 లక్షలను ప్రభుత్వం అందించనుంది.
అయితే నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవల జూనియర్ లెక్షరర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం.. త్వరలోనే వీటికి నియామక పత్రాలను అందజేస్తామని బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కూడా తెలియజేశాడు. వీటితో పాటు.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త పోస్టులకు నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నారు.
ఇప్పటికే తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను గుర్తించి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. వాటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేసి అభ్యర్థులను నియమించనున్నారు. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో పలు ఖాళీల పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ స్థాయిలో పాలనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని కొత్తగా 10,954 గ్రామ పాలనాధికారి (Village Level Officers) పోస్టులను మంజూరు చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే మాజీ వీఆర్ఏలు, మాజీ వీఆర్ఓల నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. వారిలో అర్హులైన వారికి ఈ పోస్టుల్లో నియమించనున్నారు. ఒక వేళ అందులో ఏమైనా మిగిలిన పోస్టులు ఉంటే.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కావాల్సిన తదుపరి చర్యలను తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరింది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు దాదాపు 4000లకు పైగా ఉండొచ్చనేది సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa