ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడగాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 10:33 AM

 ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు వడగాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపనున్నట్లు తెలిపింది. ఈ మెసేజ్ మీ ఫోన్‌కు వచ్చినప్పుడు ఓకే బటన్ నొక్కాలని, ఓకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగుతుందని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఎండకు దూరంగా ఉండాలని, ఎండకు బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa