ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకి వెళ్లిన అసదుద్దీన్ ఒవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 07:09 AM

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పిటిషన్‌లో ఆరోపించారు.ఇదిలా ఉండగా, వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa