పత్తి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర టెక్స్టైల్స్ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. తెలంగాణ నుంచి 40 లక్షల పత్తి బేళ్లను కేంద్రం సేకరించింది. మహారాష్ట్ర 30 లక్షల బేళ్లతో రెండో స్థానంలో నిలిచింది. 2024-25 పత్తి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా పత్తి కొనుగోళ్లను నమోదు చేసి టాప్లో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంగళవారం (ఏప్రిల్ 8న) రోజున అధికారికంగా ప్రకటించింది. మార్చి 31, 2025 వరకూ జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ నుంచి మొత్తం 40 లక్షల పత్తి బేళ్లు సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే.. తెలంగాణ ఉత్తత్తితో పోల్చితే.. తరువాతి స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవటం గమనార్హం. తెలంగాణ తర్వాతి స్థానంలో 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. అంతే.. తెలంగాణకు, మహారాష్ట్రకు మధ్య 10 లక్షల బేళ్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం.
ఇక.. గుజరాత్ 14 లక్షల బేళ్లు, కర్ణాటక 5 లక్షల బేళ్లు, మధ్యప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఒడిశా 2 లక్షల బేళ్లు, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు 1.15 లక్షల బేళ్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్టు కేంద్రం వెల్లడించిన లెక్కలు చెప్తున్నాయి.
దేశ వ్యాప్తంగా 508 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. MSP కింద 100 లక్షల బేళ్లకు సమానమైన 525 లక్షల క్వింటాళ్ల విత్తన పత్తిని కేంద్రం సేకరించింది. తెలంగాణలో సీసీఐ (Cotton Corporation of India) ఆధ్వర్యంలో 94 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని సుమారు 4.43 లక్షల మంది పత్తి రైతులు.. తెల్ల బంగారాన్ని విక్రయించారు. అయితే.. దేశవ్యాప్తంగా 21 లక్షల మంది పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.37,450 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. అయితే.. ఈ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం మధ్యస్థపూల పత్తికి క్వింటాల్కు రూ.7,121 గా నిర్ణయించగా.. దీర్ఘస్థపూల పత్తి క్వింటాల్కు రూ.7,521గా చెల్లించింది. గతేడాదితో పోల్చితే ఇది సుమారు 7 శాతం పెరుగుదల కావడం గమనార్హం.
తమ కృషికి కేంద్రం నుంచి లభించిన మద్దతుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటకు సరైన ధర లభించడం వల్ల నష్టాలు తప్పాయని.. పత్తి కొనుగోళ్లలో తెలంగాణను నెం.1 స్థానానికి చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, సీసీఐ తక్షణ స్పందన కీలక పాత్ర వహించాయని రైతుల సంఘాల ప్రతినిధులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa