బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. వరంగల్లోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను గులాబీ పార్టీ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ కోసం ఏకంగా 1213 ఎకరాల భూమిని గులాబీ పార్టీ వినియోగించుకుంది. కాగా.. సభ విజయవంతం కావడానికి భూములిచ్చిన రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం ఆ స్థలాన్ని చదును చేసి.. రకరకాల ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పొలాల గట్లు పోయాయి, హద్దులు చెరిగిపోయాయి. కాగా.. గట్లు పోయిన, దెబ్బతిన్నా పొలాలన్నింటిని తిరిగి బాగు చేస్తామని రైతులకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
తమ సభ విజయవంతమైందని.. ఇక ఆ పొలాలకు మాకు ఎలాంటి సంబంధం లేదని పక్కకు తప్పుకునే వాళ్లం తాము కాదని.. పొలాలు పూర్తిగా ఎప్పటిలా మార్చే బాధ్యత తాము తీసుకుంటామని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాగా.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభకు అవసరమైన స్థలాన్ని రైతులు స్వచ్ఛందంగా అందించారు. కాగా.. రైతుల సహకారం వల్లే సభను విజయవంతంగా నిర్వహించగలిగామని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సభ కోసం భూములిచ్చిన రైతుల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన పేర్కొన్నారు.
"సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం పొలాల గట్లు తొలగించాల్సి వచ్చింది. చాలా మంది నడుచుకుంటూ రావటం వల్ల.. అక్కడి పొలాల గెట్లు పోయాయి. కాలువలు దెబ్బతిన్నాయి. అలాగే, కొన్ని పొలాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే, ఆ భూములన్నింటినీ తిరిగి పూర్వస్థితికి తీసుకొస్తాం. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటాం." అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు అందించిన సహకారానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పోచంపల్లి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో గులాబీ పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఏకంగా 12 వందల ఎకరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలిరాగా.. వారికి అనుకూలంగా రికార్డు స్థాయిలో సభా ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa