టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై నెలకొన్న వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ పరీక్షల నిర్వహణ తీరుపై సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా అందించాలని కోరుతూ ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.గ్రూప్-1 పరీక్షల విషయంలో తమకు అనేక సందేహాలున్నాయని, అవినీతి, అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థులు ఇటీవల బండి సంజయ్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న బండి సంజయ్, ఈ మేరకు టీజీపీఎస్సీకి లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa