వేములవాడలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నకు ప్రీతికరమైన రోజైన సోమవారం నాడు ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
భక్తులు ముందుగా ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, కోడె మొక్కులు తదితర వ్రతాలు నెరవేర్చిన అనంతరం స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు దర్శనాలను వేగంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్వామివారి సేవలో తలమునకలైన భక్తులు, తాము తీర్చిన మొక్కుల కారణంగా పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని వ్యక్తపరుస్తున్నారు. అలయ ప్రాంగణమంతా మంత్రోచ్చారణలతో మారుమోగుతుండగా, భక్తుల నినాదాలతో రాజన్నగుడి చుట్టుపక్కల ప్రాంతం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa