నగరంలో ఈ రోజు (శనివారం) సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ర్యాలీ ట్యాంక్బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ వరకు సాగనుంది. ఈ మార్గం అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్ల మీదుగా వెళుతుంది. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రాకపోకల్లో అసౌకర్యం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలను అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa