ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి పుష్కరాలు.. చివరి రోజు భారీగా భక్తుల రద్దీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 11:21 AM

మే 15న ప్రారంభమైన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో చివరి రోజైన ఇవాళ భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. కాగా సోమవారం రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రి 6 గంటల నుంచి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7.46 నుంచి 7.54 వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa