మహబూబ్నగర్ జిల్లా బల్మూర్ మండలంలోని గట్టు తుమ్మెన్ గ్రామాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. భట్టి మాట్లాడుతూ, "పదేళ్ల పాలనలో గిరిజనుల గురించి కేసీఆర్ ఒక్కసారైనా ఆలోచించారా?" అని ప్రశ్నించారు.
ఆయన పోల్కంపల్లి, బొమ్మంపల్లి, పదర సబ్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, భూమిలేని నిరుపేద గిరిజన కుటుంబాలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, గిరిజనుల అభ్యున్నతికి లక్ష్యంగా ఇటీవల రూ.12 వేల కోట్లతో 'నల్లమల డిక్లరేషన్' ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులను కాపాడటంతో పాటు వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa