ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్ న్యూస్.. 4% వడ్డీకే వ్యవసాయ రుణాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 11:20 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని యథాతథంగా కొనసాగించేందుకు రూ.15,642 కోట్లు కేటాయించింది. 
రుణ పరిమితి: 
పంట సాగుకు రూ.3 లక్షల వరకు
అనుబంధ కార్యకలాపాలకు రూ.2 లక్షల వరకు
దరఖాస్తు: అన్ని బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వడ్డీ రాయితీ: 
7% వడ్డీతో రుణం తీసుకున్న రైతులు సకాలంలో చెల్లిస్తే 3% రాయితీ (బ్యాంకులకు 1.5% అదనంగా) అందుతుంది.
ఫలితం: రైతులకు కేవలం 4% వడ్డీతో రుణం అందుబాటులో ఉంటుంది.
ఈ నిర్ణయం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి, వ్యవసాయ కార్యకలాపాలకు మరింత ఊతం ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa