తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా అర్హులైన యువతకు రూ.4 లక్షల వరకు విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి.. అర్హులను ఎంపిక చేస్తున్నారు.
అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి.. తొలి విడతలో భాగంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయల యూనిట్ల కోరకు దరఖస్తు చేసుకున్న వారికి ప్రోసీడింగ్స్ ఇవ్వాలని భావించింది. కానీ అది జరగలేదు. ఈ క్రమంలో తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మరోక కీలక అప్డేట్ వచ్చింది. ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మే నెల నాటికే ఈ పథకం కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి ప్రోసీడింగ్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ లెక్కకు మించి దరఖాస్తులు రావడంతో.. నిర్దేశిత గడువు నాటికి.. వీటి పరిశీలన పూర్తి కాలేదు. ఇంకా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో రాజీవ్ యువ వికాసం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
ప్రభుత్వం తొలి విడతలో భాగంగా.. 50వేలు, లక్ష రూపాయల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించింది. ఈ కేటగిరి కింద దరఖాస్తు చేసుకున్న వారు అధిక సంఖ్యలో ఉండటంతో.. ముందుగా వీరికి యూనిట్లు మంజూరు చేస్తే.. ఎక్కువ మంది పంపిణీ చేసినట్లు అవుతుందని భావించింది. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు.
గంటలో పెళ్లి.. ఆసుపత్రి బెడ్పై వరుడు.. ఏం జరిగిందంటే..
ఈ పథకం కోసం బ్యాంక్ సిబిల్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సిబిల్ స్కోర్ను పట్టించుకోకుండా.. లబ్ధిదారులను ఎంపిక చేయమని సూచించినప్పటికీ.. అధికారులు, బ్యాంకర్లు మాత్రం దీనికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు పరిశీలిస్తుండగా.. మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుండటంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతున్నది. మొత్తంగా రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేసేందుకు మరో వారం, 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa