భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి, తిరిగి విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మార్కును దాటింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి.గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 498 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నలుగురు వ్యక్తులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 5,364గా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.కొత్తగా నమోదైన మరణాల్లో రెండు కేరళలో, పంజాబ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్య శాఖ నివేదిక పేర్కొంది. క్రియాశీల కేసుల విషయానికొస్తే, కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు అధిక సంఖ్యలో యాక్టివ్ కేసులతో తర్వాత స్థానాల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa