తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. జూలై 14 నుంచి నియోజకవర్గాలు, మండలాలవారీగా లబ్ధిదారులకు కార్డులు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఒక ముఖ్యమైన అర్హత పత్రంగా మారింది. ఈ నేపథ్యంలో.. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు 'గృహజ్యోతి' పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఎలా పొందవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గృహజ్యోతి' పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితంగా లభిస్తుంది. అయితే.. ఈ పరిమితిని ఒక్క యూనిట్ మించినా.. మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. నెలవారీ వినియోగం 200 యూనిట్లలోపు ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు. అంతే కాకుండా.. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. కొత్తగా కార్డు పొందిన వారందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్ బిల్లులోని కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం..
'గృహజ్యోతి' పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని అధికారిక ప్రభుత్వ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొందవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ వివరాలు..
పూర్తి వివరాలను నింపిన తర్వాత.. ఆ దరఖాస్తు ఫారంను స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో (పట్టణ ప్రాంతాల్లో) లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం/మండల కేంద్రాల్లోని సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు. ఈ పథకంపై ఏవైనా సందేహాలు ఉంటే, విద్యుత్ అధికారులను, లేదా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ కార్యదర్శులను, లేదా మండల కేంద్రాల్లోని అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే.. సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వీటితో పాటు.. మీ దగ్గర ప్రజా పాలన వద్ద దరఖాస్తు చేసిన రశీదు ఉండాలి. దాని ద్వారా అధికారులు జరిగిన తప్పులను సరిచేసి.. మీరు జీరో బిల్లుకు అర్హులు అయితే.. ఆ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa