గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో వైన్ షాపులు రెండు రోజులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణకు, భక్తులు ఇబ్బందులు లేకుండా నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు దోహదపడనున్నాయి.
జిల్లా స్థాయిలో నిబంధనలు..
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. ఆదిలాబాద్లో ఈ నెల 4వ తేదీ నుంచి.. అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి.. 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాంతాలవారీగా వైన్ షాపులు బంద్ చేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో సహా పలు జిల్లాల్లో ఈనెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకున్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో.. ఈ చర్యలు రవాణా భద్రతకు కూడా తోడ్పడనున్నాయి.
ఈ నెల 6, 7 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీగా వినాయక నిమజ్జనం జరగనుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది. ట్యాంక్ బండ్పై ఈ రెండు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలను అమలు చేయనున్నారు. నిమజ్జనం కార్యక్రమం సులభంగా.. భద్రంగా జరిగేలా పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
పెద్ద పెద్ద గణపతి విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రత్యేక క్రేన్లు, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఈ నిబంధనలు భక్తులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 6న నిర్వహించే ఈ శోభాయాత్రకు కేంద్ర హోం మంత్రి అబిత్ షా రానున్నారు. బడా గణేష్ నిర్వాహకులు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు హోం మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa