భారత రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీసుకున్న కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. పార్టీ అప్రతిష్టకు దారి తీసే ప్రవర్తనను సహించేది లేదని స్పష్టంగా తెలిపారు. ఇది పార్టీ విలువలను కాపాడే దిశగా తీసుకున్న నిబద్ధతగా పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఎలా ఎండగట్టారో ఆమె ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. హరీశ్ రావు మాట్లాడిన తీరే నిజాలను వెలికితీసిందని వ్యాఖ్యానించారు.
కవిత చేసిన ఆరోపణలు బాధ కలిగించాయనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లకు హరీశ్ రావు మొక్కారన్న ఆమె వ్యాఖ్యలు అసత్యమనీ, అవి తప్పుడు ప్రచారానికి పాల్పడటమేనని పద్మా దేవేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ లాభాల కోసమేనని అన్నారు.
అంతేకాకుండా, గతంలో కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సమయంలో పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం కవిత కాంగ్రెస్ ప్రభుత్వ డైరెక్షన్లో నడుస్తున్నట్లు ఆరోపణ చేశారు. “కేసీఆర్ కుమార్తెగా ఉన్న గౌరవాన్ని నిలుపుకోలేకపోయారు” అని ఆమె విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa