తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పరిశ్రమలకు మద్దతుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ సమీక్ష జరిగింది.
వికారాబాద్-కృష్ణా మధ్య ప్రతిపాదిత రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరిచే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే పరిశీలనలో ఉన్న ఈ మార్గాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన అమలు చేయాలని సూచించారు.
తెలంగాణలో పరిశ్రమల పెరుగుదల దృష్ట్యా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్లకు అనువుగా ఉండే రైల్వే లైన్ల ఏర్పాటుపై సీఎం దృష్టిసారించారు. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను వెల్లడించారు. ఇది దిగుమతి, ఎగుమతుల రవాణా కోసం కీలకంగా మారనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర రవాణా వ్యవస్థ కోసం రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు అత్యవసరమని సీఎం పేర్కొన్నారు. ఇది హైదరాబాద్ మేడికల్, ఐటి, పరిశ్రమల క్లస్టర్లను సమర్థవంతంగా అనుసంధానించే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ రకం ప్రాజెక్టులు నేడు అవసరంగా మారాయని, త్వరితగతిన ప్రణాళిక రూపకల్పన జరగాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa