హైదరాబాద్ లోని మూసాపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలోని యాదవబస్తీలో నివాసం ఉండే తులసమ్మ, జానకీరావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల క్రితం వారి పెద్ద కుమార్తె రమ్య (18)ను ప్రొక్లెయిన్ డ్రైవర్ గా పనిచేసే అశోక్ కు ఇచ్చి వివాహం జరిపించారు.ప్రస్తుతం భర్త అశోక్ తో పాటు రమ్య పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే రమ్య తరచుగా ఫోన్ లో మాట్లాడుతుండటంతో తులసమ్మ మందలించింది. వివాహం కూడా అయింది, ఇక సంసార బాధ్యతలు నేర్చుకోవాలని చెప్పింది. సోమవారం మధ్యాహ్నం తల్లీకూతుళ్లు మార్కెట్ కు వెళ్లి వచ్చాక ఈ విషాద సంఘటన జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రమ్య.. తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తె నిద్రపోతోందేమోనని భావించిన తులసమ్మ ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. రాత్రి 11:30 గంటల సమయంలో రమ్య ఉరేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి తులసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa