తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వెంకట హర్షవర్ధన్ రెడ్డి అఖిల రాష్ట్రంలో తొలి స్థానం సాధించడం గర్వకారణంగా మారింది. ఆయన మొత్తం 447.088 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో ఆయన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుకు ఎంపికయ్యారు.
ఇది సాధించడంలో విశేషం ఏమిటంటే, హర్షవర్ధన్ ఎలాంటి కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా, స్వయంగా ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఈ ఘనతను సాధించారు. క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో నిరంతరం చదువుకోవడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగానని ఆయన వెల్లడించారు.
హర్షవర్ధన్ రెడ్డి తండ్రి రమణారెడ్డి, కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. కుటుంబం నుంచి లభించిన మద్దతు, ప్రోత్సాహం కూడా హర్షవర్ధన్ విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పొచ్చు.
మహిళా అభ్యర్థుల్లో వినీషా రెడ్డి టాపర్గా నిలవడం మరో విశేషం. ఈ ఏడాది గ్రూప్-2 ఫలితాల్లో విద్యార్థులు తక్కువ వనరులతోనే గొప్ప విజయాలు సాధిస్తున్న తీరు ఎంతో ప్రేరణాత్మకంగా మారుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa