ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 12:06 PM

పటాన్చెరు : శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు పురస్కరించుకొని..సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ లాలూ నాయక్, రామచంద్రారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa