ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:19 PM

ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో సోమవారం ఒక్కరోజే కిలో వెండి ధరపై ఏకంగా రూ.7,000 పెరిగి రూ.1.5 లక్షల మైలురాయిని తాకింది. గత వారం రోజుల్లోనే కిలో వెండిపై రూ.19,051 పెరగడం గమనార్హం. మరోవైపు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,500 పెరిగి రూ.1,19,500 వద్ద స్థిరపడింది.ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించాయి. గత ఏడాది డిసెంబర్ 31 నాటి ధరలతో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ఇప్పటివరకు రూ.40,550 (51.36 శాతం) లాభం రాగా, కిలో వెండిపై రూ.60,300 (67.22 శాతం) రాబడి వచ్చింది. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో, పెట్టుబడిదారుల దృష్టి బులియన్ మార్కెట్‌పై కేంద్రీకృతమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa