ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్మికులకు చీరలు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:00 PM

శేరిలింగంపల్లిలో భారాస సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్, జీహెచ్ఎంసీ కార్మికులకు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మహిళలకు చీరలను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఇస్తున్నట్లే ఈ ఏడాది కూడా మహిళలకు, పేదలకు దసరా కానుకను అందించామని తెలిపారు. భారాస అధినేత కేసీఆర్ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు అందేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది చీరలు ఇవ్వకుండా మహిళలను మోసం చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భారాస అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రభుత్వం ఎగ్గొట్టిన చీరలతో సహా కేసీఆర్ ప్రభుత్వంలో అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa