TG: రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఏఎస్సై మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో జరిగింది. కర్ణాటకలోని చించోలి తాలూకా మార్పల్లికి చెందిన మారుతి(49) కలబురగి జిల్లా జేడీ హల్లి పీఎస్లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు వెళ్లేందుకు తాండూరులో రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ప్రమాదవశాత్తు జారిపడటంతో రెండు కాళ్లు విరిగాయి. చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa